Power supply: ఆ ఏరియాల్లో.. 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్
ABN , Publish Date - Nov 04 , 2025 | 06:38 AM
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ అమృత ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
పంజాగుట్ట(హైదరాబాద్): బంజారాహిల్స్ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ(ADE G.Gopi) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ అమృత ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ భారతీయ విద్యాభవన్ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 11కేవీ పద్మాలయ స్టూడియో ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు...
గాజులరామారం: గాజులరామారం విద్యుత్ సబ్స్టేషన్(Gajularamaram Electricity Substation) పరిధిలోని 220 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ను నిలిపివేస్తున్నట్లు ఏఈ చైతన్యభార్గవ్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రగిరినగర్ చౌరస్తా, అంబేడ్కర్నగర్, ఉమాదేవినగర్(Ambedkarnagar, Umadevinagar), జననీ స్కూల్లైన్, చంద్రగిరినగర్ దర్గాలైన్, చంద్రగిరినగర్ బాలాజీ స్కూల్లైన్, పీపీనగర్ మసీద్లైన్, శ్రీవేణుహిల్స్కాలనీ, కైలా్సహిల్స్, జహంగీర్ బస్తీలైన్, ఇందిరానగర్ బీ నగర్లో విద్యుత్ ఉండదని ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్స్టేషన్లు
Read Latest Telangana News and National News