Hyderabad: సీయూఈటీ(పీజీ) దరఖాస్తుకు గడువు ఫిబ్రవరి 2
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:23 AM
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 41 పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు కోడింగ్ సిద్ధం చేసినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు.
మార్చి 13 నుంచి 31 వరకు ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్ సిటీ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 41 పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు కోడింగ్ సిద్ధం చేసినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈయూటీ)ద్వారా జరుగుతాయని తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 2లోగా సీయూఈటీ(పీజీ)-2025కు దరఖాస్తు చేసుకోవాలని గురువారం సూచించారు. ప్రవేశ పరీక్షలు మార్చి 13 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్రావు