Share News

Harish Rao: రేవంత్‌రెడ్డికి మెదడు ఖరాబైంది: హరీశ్‌రావు

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:57 AM

‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మెదడు ఖరాబ్‌ అయింది. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్‌ కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని అంటుండ’ని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao: రేవంత్‌రెడ్డికి మెదడు ఖరాబైంది: హరీశ్‌రావు

గజ్వేల్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మెదడు ఖరాబ్‌ అయింది. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్‌ కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని అంటుండ’ని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ పాలకవర్గ అభినందన సభకు ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు.


కాళేశ్వరంలో భాగమైన రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ జలాశయాలను, కాలువలను చూసి, రేవంత్‌ రెడ్డి తనమెదడును సరి చేసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్‌లో రైతు రుణమాఫీ పేరిట ఇచ్చిన రూ.2,550 కోట్ల చెక్కు డమ్మీ చెక్‌ అని, ఇప్పటికీ ఆ చెక్కు ఫైనాన్స్‌లో క్లియర్‌ కాలేదని విమర్శించారు. మహబూబ్‌నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టులపై జిల్లాలోని కురుమూర్తి దేవాలయం వద్దకు రేవంత్‌రెడ్డి రావాలని సవాల్‌ విసిరారు.

Updated Date - Jan 27 , 2025 | 05:57 AM