Share News

Hyderabad: రూ. 300 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా

ABN , Publish Date - Feb 06 , 2025 | 10:23 AM

సుమారు రూ. 300 కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రభుత్వ సూచిక బోర్డు తొలగించి ఆ స్థలంలో షెడ్లు, టెంట్లు వేసి ప్రైవేట్‌ సైన్యాన్ని కాపలాపెట్టారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Hyderabad: రూ. 300 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా

- షెడ్లు, టెంట్లు వేసి ప్రైవేట్‌ సైన్యంతో కాపలా

- కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

- ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు

హైదరాబాద్: సుమారు రూ. 300 కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రభుత్వ సూచిక బోర్డు తొలగించి ఆ స్థలంలో షెడ్లు, టెంట్లు వేసి ప్రైవేట్‌ సైన్యాన్ని కాపలాపెట్టారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10(Banjara Hills Road No. 10) తట్టిఖానాలో జలమండలి కార్యాలయం పక్కనే ప్రభుత్వానికి చెందిన మూడెకరాల స్థలం ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో కొంతమంది ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకుంది.

ఈ వార్తను కూడా చదవండి: MLA: ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తాం..


కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్‌(Banjara Hills) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా కబ్జాదారులు స్థలంలో షెడ్లు, రెండు టెంట్లు వేసి ప్రైవేటు సైన్యాన్ని కాపలాగా పెట్టారు. ప్రభుత్వ సూచిక బోర్డులను తొలగించారు. సమాచారం అందుకున్న షేక్‌పేట తహసీల్దార్‌ అనితారెడ్డి సిబ్బందితో వెళ్లి షెడ్లను, టెంట్లను తొలగించి ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేశారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన

ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2025 | 10:23 AM