CM Revanth Reddy: నయా ఉస్మానియాకు నేడు సీఎం శంకుస్థాపన
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:27 AM
ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం గోషామహల్ స్టేడియంలో శంకుస్థాపన చేయనున్నారు.

హైదరాబాద్ సిటీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం గోషామహల్ స్టేడియంలో శంకుస్థాపన చేయనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవనంలో 30 విభాగాలు 2 వేల పడకలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి విభాగంలో ఒక్కో ఆపరేషన్ థియేటర్, ఆధునిక సదుపాయాలతో ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆస్పత్రి భవనం నమూనా చిత్రాన్ని గురువారం విడుదల చేశారు.