Share News

రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా చిత్రా రామచంద్రన్‌

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:24 AM

తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ (రెరా) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారిణి చిత్రా రామచంద్రన్‌ను నియమించారు.

రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా చిత్రా రామచంద్రన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ (రెరా) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారిణి చిత్రా రామచంద్రన్‌ను నియమించారు. ఇప్పటి వరకు రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైౖర్మన్‌గా ఉన్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డిని ప్రభుత్వం లోకాయుక్తగా నియమించింది. ఆయన రాజీనామాతో అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌ పోస్ట్‌ ఖాళీ అయింది. జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌ శనివారం ఉత్తర్వు(జీవో87)లిచ్చారు. అదే ఉత్తర్వుల్లో పూర్తి స్థాయి చైర్మన్‌ నియామకం జరిగే వరకు ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా చిత్రా రామచంద్రన్‌ కొనసాగుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో పరిపాలనా సభ్యురాలిగా ఉన్నారు.


సమాచార శాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా వినయ్‌ కృష్ణారెడ్డి

సమాచార, పౌర సంబంధాలశాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా టి.వినయ్‌ కృష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్‌ ఎస్‌.హరీశ్‌ విదేశీ పర్యటనకు వెళ్తుండటంతో ఆయన స్థానంలో ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఆర్‌ అండ్‌ ఆర్‌, భూ సేకరణ కమిషనర్‌గా ఉన్న వినయ్‌ కృష్ణారెడ్డిని సమాచార, పౌర సంబంధాల శాఖ ఇంచార్జ్‌ కమిషనర్‌గా నియమించింది.


ఇవి కూడా చదవండి

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 27 , 2025 | 04:24 AM