Share News

Road Accident: చేవెళ్ల ఘటన.. గుండెను పిండేసే దృశ్యాలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 09:59 AM

చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు పలు హృదయాలను కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: చేవెళ్ల ఘటన.. గుండెను పిండేసే దృశ్యాలు
Chevella Road Accident

చేవెళ్ల, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు పలు హృదయాలను కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఘటన సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలు చేయడం గుండెను పిండేసేవిగా ఉన్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

CompressJPEG.Online_img(1280x720).jpg


కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

WhatsApp Image 2025-11-03 at 9.35.11 AM.jpeg


మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.WhatsApp Image 2025-11-03 at 9.39.51 AM.jpeg


ఇవి కూడా చదవండి:

Nacharam Murder: ఖమ్మంలో మహిళ, నాచారంలో వ్యక్తి దారుణ హత్య

Inter Board: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు

Updated Date - Nov 03 , 2025 | 11:42 AM