Share News

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్..

ABN , Publish Date - Jul 19 , 2025 | 07:05 AM

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ వేదం, వైష్ణవి రెసిడెన్సీ, కృష్ణా నగర్‌ సి-బ్లాక్‌, జూబ్లీహిల్స్‌ పీఈఐ అండర్‌ గ్రౌండ్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ పత్రికానగర్‌ ఏరియాలో కరెంట్ ఉండదని తెలిపారు.

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్..
Power Supply

  • నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: బంజారాహిల్స్‌(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ వేదం, వైష్ణవి రెసిడెన్సీ, కృష్ణా నగర్‌ సి-బ్లాక్‌, జూబ్లీహిల్స్‌ పీఈఐ అండర్‌ గ్రౌండ్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ పత్రికానగర్‌, కుమ్మరిబస్తీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. అలాగే, గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌ సింగ్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ ఎర్రగడ్డ, శంకర్‌ లాల్‌ నగర్‌, ప్రేమ్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


కేపీహెచ్‌బీకాలనీ: టీజీఎస్పీడీసీఎల్‌ వసంతనగర్‌ సెక్షన్‌ పరిధిలో చెట్లకొమ్మల తొలగింపు కోసం శనివారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. వసంతనగర్‌, భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌-2, శ్రీసాయినగర్‌, సర్దార్‌పటేల్‌నగర్‌, హైదర్‌నగర్‌ మెయిన్‌ రోడ్డు ప్రాంతంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


ఉప్పల్‌: విద్యుత్‌ లైన్ల మార్పులు, ఇతర మరమ్మతుల కారణంగా శనివారం వివిధ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు బోడుప్పల్‌ సబ్‌స్టేషన్‌ ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌ తెలిపారు. ఆంజనేయనగర్‌ ఫీడర్‌ పరిధిలోని ద్వారకా నగర్‌, ఆంజనేయ నగర్‌, కేశవ నగర్‌, గాయత్రి నగర్‌, లక్ష్మీనగర్‌లలో విద్యుత్‌ సరఫరా ఉండదని వినియోగదారులు తమ సిబ్బందితో సహకరించాలని కోరారు. బృందావన్‌ కాలనీ ఫీడర్‌ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, సాయి మారుతీ నగర్‌, లక్ష్మీనగర్‌, కేశవ నగర్‌, ఎన్‌టీఆర్‌ విగ్రహం నుంచి సిద్ధార్థ స్కూల్‌ మెయిన్‌ రోడ్డు వరకు, బృందావన్‌ కాలనీలలో కూడా కరెంటు సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.


మౌలాలి సబ్‌ స్టేషన్‌ పరిధిలో..

కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా 11 కేవీ గాయత్రీనగర్‌ ఫీడర్‌ పరిధిలోని ఓల్డ్‌ మౌలాలి, సాదుల్లానగర్‌, చందాబాగ్‌, హ్యాపీహోమ్స్‌, ఆండాళ్‌నగర్‌, ఎస్పీనగర్‌, పటేల్‌నగర్‌, గ్రీన్‌హిల్స్‌ కాలనీ, గాయత్రీనగర్‌ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 11 నుంచి 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని మౌలాలి సబ్‌ స్టేషన్‌ ఏఈ వెంకట్‌ రెడ్డి తెలిపారు.


city1.2.jpg

గాజులరామారం: గాజులరామారం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ ఉండదని ఏఈ చైతన్యభార్గవ్‌ తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఉషాముళ్లపూడి సొసైటీ,ఎండమూరి లేఅవుట్‌, మహదేవపురం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు షిర్డీహిల్స్‌, కైలాష్‌ హిల్స్‌, ప్రాగాటూల్స్‌, నందిని హిల్స్‌, తిరుమల హిల్స్‌, పీఎన్‌ఆర్‌ ఎంపైర్‌ వెంచర్‌లలో విద్యుత్‌ ఉండదని వెల్లడించారు.


రాయదుర్గం: కోమరంభీం విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు అంబిక సూపర్‌మార్కెట్‌, పెద్దమ్మతల్లి ఆలయం, బీఎన్‌ చౌరస్తా, వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ప్రశాంతిహిల్స్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ప్రశాంతిహిల్స్‌, ఎంజేఆర్‌ దాబా, టీఎన్‌జీఓ కాలనీలో విద్యుత్‌ ఉండదు.

ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు మంజీర డైమండ్‌ టవర్స్‌ ఫీడర్‌ పరిధిలోని జర్నలిస్టుల కాలనీ, ఫైర్‌స్టేషన్‌లో.. సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు రాయదుర్గం, మధురానగర్‌.. 10.30 నుంచి 11 గంటల వరు ఖాజాగూడ గ్రామం, ఏసీ అట్లాంటిక్‌ అపార్ట్‌మెంట్స్‌, వీకర్‌సెక్షన్‌కాలనీ, ఖాజాగూడ మెయిన్‌రోడ్‌, ఓక్రిడ్జి స్కూల్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Read Latest Telangana News and National News

Updated Date - Jul 19 , 2025 | 09:46 AM