India A Women: ఆదుకొన్న రాఘవి షఫాలీ
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:02 AM
రాఘవి బిస్త్ (86), షఫాలీ వర్మ (52) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. ఆస్ట్రేలియా-ఎతో అనధికార టెస్టులో భారత్-ఎ మహిళల జట్టు 254 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజైన శనివారం ఆట ముగేసిసరికి...
భారత్-ఎ రెండో ఇన్నింగ్స్ 260/8
ఆసీ్స-ఎ 305 ఆలౌట్
బ్రిస్బేన్: రాఘవి బిస్త్ (86), షఫాలీ వర్మ (52) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. ఆస్ట్రేలియా-ఎతో అనధికార టెస్టులో భారత్-ఎ మహిళల జట్టు 254 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజైన శనివారం ఆట ముగేసిసరికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 260/8 స్కోరు చేసింది. జోషిత (9), టిటాస్ సాధు (2) క్రీజులో ఉన్నారు. అమీ ఎడ్గర్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 158/5తో తొలి ఇన్నింగ్స్ను కొసాగించిన ఆస్ట్రేలియా-ఎ 305 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ (299) స్కోరుకు ఆరు పరుగుల ఆధిక్యం నమోదు చేసింది. సియన్నా జింజర్ (103) సెంచరీ సాధించగా.. సైమా 3 వికెట్లు పడగొట్టింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి