Raghavi Bist: భారత్ ఎ 299 ఆలౌట్
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:08 AM
రాఘవీ బిస్త్ 93, జోషిత 51, అర్ధ శతకాలతో పోరాడడంతో ఆస్ట్రేలియా ఎ జట్టుతో అనధికార టెస్ట్లో భారత్....
బ్రిస్బేన్: రాఘవీ బిస్త్ (93), జోషిత (51) అర్ధ శతకాలతో పోరాడడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో అనధికార టెస్ట్లో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఓవర్నైట్ 93/5 స్కోరుతో శుక్రవారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 299 పరుగులకు ఆలౌటైంది. జార్జియా, బ్రౌన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో రోజు ఆఖరికి 158/5 స్కోరుతో ఇక్కట్లలో పడింది. తహిలా విల్సన్ (49) రాణించింది. మీడియం పేసర్ సలీమా, స్పిన్నర్ రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు కైవసం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి