Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్లో పాక్ యాంకర్ కన్నీరు..
ABN , Publish Date - May 08 , 2025 | 06:51 AM
Operation Sindoor: ఓ పాక్ న్యూస్ యాంకర్ ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కూడా వైరల్ అయింది. అది కూడా షో లైవ్లో ఉండగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

జమ్మాకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు చనిపోయారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సంఘటన జరిగింది. సరిగ్గా 13 రోజుల తర్వాత భారత ఆర్మీ ఉగ్రవాదులకు సరైన విధంగా సమాధానం చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలను పేల్చి పడేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్పై ప్రశంసలు కురిపిస్తోంది.
ఇక, ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాడి వీడియోలతో పాటు మరికొన్ని పాక్ ప్రజల స్పందనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్గా మారాయి. ఓ పాక్ న్యూస్ యాంకర్ ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కూడా వైరల్ అయింది. అది కూడా షో లైవ్లో ఉండగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఆమె పాకిస్తాన్ యాంకరా.. కాదా అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు.
సోషల్ మీడియాలో మాత్రం ఆమె పాకిస్తాన్ యాంకర్ అని.. ఆమె ఆపరేషన్ సింధూర్ ప్రభావం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాలు మాత్రం తెలియలేదు. ఇక, ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే.. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఆర్మీ వైమానిక దాడులు జరిపింది. అది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ దాడులు జరిగాయి. త్రివిధ దళాలు ఎంతో నైపుణ్యంతో ఈ దాడులను విజయవంతంగా ముగించాయి.
ఇవి కూడా చదవండి
Vamsi PSR Remand: వంశీ, పీఎస్ఆర్లకు రిమాండ్ పొడిగింపు
Today Horoscope: ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం.. అప్రయత్న కార్యసిద్ధి