Old Woman Shows Aadhaar: రైలు ఎక్కి ఆధార్ చూపించిన వృద్ధురాలు.. అందరూ షాక్..
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:04 PM
ఓ వృద్ధురాలు టికెట్ తీసుకోకుండా రైలులో ప్రయాణం చేస్తూ ఉంది. ఇంతలో టికెట్ కలెక్టర్ ఆమె దగ్గరకు వచ్చాడు. టికెట్ చూపించమని అడిగాడు. ఆ వృద్ధురాలు వెంటనే తన దగ్గర ఉన్న ఆధార్ కార్డు తీసి అతడి చేతిలో పెట్టింది.
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాయి. స్థానిక ఆధార్ కార్డు ఉన్న మహిళలు రాష్ట్రం మొత్తం ఎంపిక చేసిన బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. బస్సు ఎక్కి ఆధార్ చూపిస్తే ఫ్రీ టికెట్ చేతికొచ్చేస్తోంది. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వారి వరకు ఫ్రీగా ఇష్టం వచ్చిన చోటుకు ఖర్చు లేకుండా తిరిగేస్తున్నారు. తాజాగా, ఓ వృద్ధురాలు రైలు ఎక్కింది. టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తూ ఉంది. ఇంతలో టికెట్ కలెక్టర్ ఆమె దగ్గరకు వచ్చాడు.
ఆమె ముందు కూర్చుని టికెట్ చూపించమని అడిగాడు. ఆ వృద్ధురాలు వెంటనే తన దగ్గర ఉన్న ఆధార్ కార్డు తీసి అతడి చేతిలో పెట్టింది. అతడికి ఏమీ అర్థం కాలేదు. ‘ఏంటిది?’ అని అడిగాడు. పక్కనే ఉన్న మహిళ ‘బస్సులో ఆధార్ చూపిస్తే ఫ్రీ టికెట్ ఇస్తున్నారు కదా.. అలానే రైలు టికెట్ ఇస్తారనుకుంటోంది’ అని అంది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. టీసీకి నవ్వు ఆగలేదు. ఆధార్ కార్డు వెనక్కు ఇచ్చేసి ‘రైలులో ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇవ్వరు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే’ అన్నాడు.
దీన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. సికందర్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ అయింది. ‘రైలులో ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డు చూపించిన బామ్మ. పాపం.. ఆ పెద్దావిడకు రైలులో ఆధార్ కార్డుతో ఫ్రీగా టికెట్ ఇవ్వరని తెలియదు కదా?. ఆ బామ్మ కల నెరవేరాలంటే రాహుల్ గాంధీ కానీ, సిద్ధరామయ్య కానీ, ప్రధాని కావాల్సిందే’ అని రాసుకొచ్చాడు. ఇక, ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ బాబా అరెస్టు.. 2 నకిలీ విజిటింగ్ కార్డులు, 3 మొబైల్స్ స్వాధీనం
యువతుల్ని నమ్మించి తీసుకెళ్లి.. ఇన్స్టా లైవ్లో చిత్ర హింసలు పెట్టి..