Share News

Shocking: వీళ్లేం తల్లిదండ్రులు! కన్నకూతురు ఎప్పటికీ చిన్న పిల్లలా ఉండాలని..

ABN , Publish Date - Feb 02 , 2025 | 10:20 PM

తమ కన్న బిడ్డ ఎప్పటికీ చిన్న పాప లాగానే ఉండాలనే అసాధారణ కోరికతో ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. తమ బిడ్డను పస్తులుంచి ఎదగకుండా చేసింది. ఈ కేసులో కోర్టు తాజాగా తండ్రికి ఆరున్నరేళ్ల జైలు శిక్ష, తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.

Shocking: వీళ్లేం తల్లిదండ్రులు! కన్నకూతురు ఎప్పటికీ చిన్న పిల్లలా ఉండాలని..

ఇంటర్నెట్ డెస్క్: చిన్నతనంలో పిల్లల ముద్దు మాటలను, అల్లరి చూసి తల్లిదండ్రులెవరైనా మురిసిపోతారు. తమ సంతానం జీవితమంతా ఇలాగే చిన్నారుల్లా ఉండిపోతే ఎంత బాగుండునో అని అనుకుంటారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట కూడా సరిగ్గా ఇదే అనుకున్నారు. అక్కడితో ఆగక తమ ఆలోచనను అమల్లో పెట్టి కన్న కూతురిని నిజంగానే ఎదగకుండా చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశారు (Viral).

Viral: జపాన్‌లో హృదయవిదారక ఘటన.. జైల్లో ఉండేందుకు నేరాలకు దిగిన 81 ఏళ్ల వృద్ధురాలు!


2021లో ఈ దారుణం వెలుగులోకి రాగా కూతురిని పస్తులు పెట్టినందుకు తండ్రికి ఆరున్నరేళ్ల జైలు శిక్ష, తల్లికి ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు తాజాగా ఖరారు చేసింది. 2021లో బాలికకు 16 ఏళ్ల వయసున్నప్పుడు స్కూల్లో టీచర్లు ఆమె దుస్థితిని గుర్తించారు. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆమె బరువు కేవలం 60 పౌండ్లు మాత్రమే ఉండేది. విషయాన్ని బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించి విఫలమయ్యారు. ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినా తల్లిదండ్రుల నుంచి ప్రతిస్పందన రాలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ బాలికను స్కూలుకు పంపించడం కూడా మానేశారు. స్నేహితులు, తోటి విద్యార్థులను కలవకుండా కట్టడి చేశారు. ఈ క్రమంలో ఓ డాక్టర్ బాలిక పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు బాలికను ఆసుపత్రికి తరలించి ఐసీయూలో వైద్యం చేయాల్సి వచ్చింది. ఆమెకు కనీస జీవన నైపుణ్యాలేవీ నేర్పకపోవడంతో ప్రస్తుతం ఆమెకు 20 ఏళ్ల వచ్చినా తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన స్థితికి చేరుకుంది.


Uttarpradesh: దారుణం.. మరదలిని హత్య చేయించేందుకు రూ.40 వేలు అప్పు చేసి.. ఆపై..

ఇక పోలీసు విచారణ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ కూతురు ఎప్పటికీ చిన్న పిల్లలా ఉండాలనే ఉద్దేశంతో వారు ఆమెకు పోషకాహారం అస్సలు ఇచ్చేవారు కారని తెలిసింది. అంతేకాకుండా, ఆమెకు చిన్న పిల్లలకు వేసే చిట్టి డ్రెస్‌లు వేసేవారని, ఆమె ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు సృష్టించినట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో, బిడ్డలను పస్తుపెట్టిన కారణంగా తండ్రికి ఆరున్నర ఏళ్లు, తల్లికి ఐదేళ్ల మేర జైలు శిక్షను కోర్టు విధించింది.

Read Latest and Viral News,

Updated Date - Feb 02 , 2025 | 10:20 PM