Chennai: 2.53 లక్షల తాబేళ్ల గుడ్ల సేకరణ..
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:12 PM
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సముద్ర తీరంలో 2.53 లక్షల తాబేళ్ల గుడ్లు సేకరించినట్లు అటవీ శాఖ తెలిపింది. ఈమేరకు కడలూరు, నాగపట్టణం, చెన్నైలో ఈ గుడ్లను సేకరించినట్లు అధికారులు తెలిపారు.

చెన్నై: రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాల్లో 2.53 లక్షల తాబేళ్ల గుడ్లు సేకరించినట్లు అటవీ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రతి ఏడాది డిసెంబరు నుండి మార్చి వరకు, తాబేళ్లు తీర ప్రాంతాలకు వచ్చి ఇసుకలో గుంతలు తవ్వి గుడ్లు పెట్టి వెళ్తుంటాయి. ఈ గుడ్లు పక్షులు, ఇతర జంతువుల నుంచి రక్షించి అటవీ శాఖ వాటికి సేకరించి, ప్రత్యేక ప్రాంతంలో పొదిగించి, పిల్లలు వచ్చిన తర్వాత వాటిని సముద్రంలోకి వదిలి పెడుతుంటారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: మాజీసీఎం భద్రతా విభాగంలో పనిచేసిన రిటైర్డ్ ఎస్ఐ దారుణహత్య
ఆ ప్రకారం, గత జనవరి నుంచి ఈ నెల 16వ తేది వరకు రాష్ట్రంలోని సముద్రతీరాల్లోని 55 ప్రాంతాల్లో 2.53 లక్షల గుడ్లు సేకరించారు. కడలూరు(Kadaluru)లో అధికంగా 87,871, నాగపట్టణంలో 73,385, చెన్నైలో 43,900 గుడ్లు సేకరించినట్లు అటవీ శాఖ తెలియజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?
కేసీఆర్కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు
రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News