Chennai: వెంబకోట తవ్వకాల్లో మట్టి ముంత, శంఖపు గాజు లభ్యం
ABN , Publish Date - Jan 23 , 2025 | 11:39 AM
వెంబకోట వద్ద జరిపిన తవ్వకాల్లో ప్రాచీన కాలం నాటి మట్టి ముంత, శంఖపు గాజుముక్క బయల్పడ్డాయి. విరుదుగనర్ జిల్లా వెంబకోట సమీపం విజయ కరిచల్కుళం వద్ద మూడో విడత పురావస్తు తవ్వకాలు జరుగుతున్నాయి.
చెన్నై: వెంబకోట(Vembakota) వద్ద జరిపిన తవ్వకాల్లో ప్రాచీన కాలం నాటి మట్టి ముంత, శంఖపు గాజుముక్క బయల్పడ్డాయి. విరుదుగనర్ జిల్లా వెంబకోట సమీపం విజయ కరిచల్కుళం(Vijaya Karichalkulam) వద్ద మూడో విడత పురావస్తు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా 16 గుంతలు తవ్వగా 2 వేలకు పైగా ప్రాచీన కాలం నాటి వస్తువులు లభ్యమయ్యాయి. గత నెల ఎరుపురంగులో కాల్చిన మట్టితో తయారైన అలంకరణ వస్తువును తలపై ధరించి ఉన్న మానవుడి శిరస్సు లభించింది. ఈ నేపథ్యంలో వెంబకోట(Vembakota) వద్ద మూడో విడత పురావస్తు తవ్వకాల్లో మట్టితో తయారైన ముంత, శంఖంతో తయారైన చేతి గాజు ముక్క లభ్యమయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: Police station: పోలీస్స్టేషన్ ముందే ఆత్మాహుతి
ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి
ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు
ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?
Read Latest Telangana News and National News