Health Tips: వరుసగా రెండు వారాల పాటు మెంతులు తింటే.. జరిగేది ఇదే..
ABN, Publish Date - Aug 17 , 2025 | 09:50 PM
మెంతులు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. మెంతుల్లోని ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్-డి, విటమిన్- సి తదితర పోషకాలు ఆరోగ్యాన్ని అందిస్తాయి.
1/7
మెంతులు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. మెంతుల్లోని ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్-డి, విటమిన్- సి తదితర పోషకాలు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే అయితే వరుసగా రెండు వారాల పాటు మెంతులు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2/7
మెంతి గింజలు శరీరంలోని రక్తహీనతను తొలగించడంలో బాగా పని చేస్తాయి. ఇందులో కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.
3/7
మెంతులు పేగుల్లో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
4/7
మెంతి గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కడుపులో చికాకు, మలబద్ధకం తదితర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
5/7
ఒక టేబుల్ స్పూన్ మెంతులు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తింటే ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.
6/7
మెంతి గింజలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అలెర్జీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొంతమందిలో విరోచనాలు, వికారం, తల తిరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు.
7/7
అలెర్జీలు ఉన్న వారు మెంతి గింజలు తినే ముందు వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Updated at - Aug 23 , 2025 | 02:12 PM