CM Revanth Reddy: విన్‌గ్రూప్ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో భేటీ

ABN, Publish Date - Nov 16 , 2025 | 07:57 AM

విన్‌గ్రూప్ ఆసియా సీఈఓ శ్రీ ఫామ్ సాన్ చౌ, విన్‌గ్రూప్ చైర్మన్ శ్రీ ఫామ్ నాట్ వుంగ్‌లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శనివారం నాడు సమావేశం అయ్యారు.ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులపై సీఎం చర్చించారు. సమావేశంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో ప్రధాన పెట్టుబడులను అన్వేషించాలనే సానుకూల ఉద్దేశం కూడా తమ ప్రభుత్వానికి ఉందని ఉద్ఘాటించారు. విన్‌గ్రూప్ బృందం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీ నిల్వ, పునరుత్పాదక శక్తి , భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులను పరిశీలిస్తుందని వివరించారు. డిసెంబర్ 8,9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025లో పాల్గొనాలని ఆహ్వానించారు.

Updated at - Nov 16 , 2025 | 07:57 AM