CM Revanth Reddy: ఢిల్లీలో USISPF వార్షిక సమావేశం.. పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి
ABN, Publish Date - Nov 14 , 2025 | 07:52 AM
ఢిల్లీలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (యూఎస్ఐ ఎస్పీఎఫ్) వార్షిక సమావేశం గురువారం నాడు జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, Cisco మాజీ CEO జాన్ చాంబర్స్, US-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (USISPF) అగ్ర నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్రెడ్డి తెలంగాణకు అవసరమైన పెట్టుబడులపై ప్రత్యేకంగా చర్చించారు.
1/10
ఢిల్లీలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (యూఎస్ఐ ఎస్పీఎఫ్) వార్షిక సమావేశం గురువారం నాడు జరిగింది.
2/10
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, Cisco మాజీ CEO జాన్ చాంబర్స్, US-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (USISPF) అగ్ర నాయకులు పాల్గొన్నారు.
3/10
ఈ భేటీలో తెలంగాణకు అవసరమైన పెట్టుబడులపై ప్రత్యేకంగా చర్చించారు సీఎం రేవంత్రెడ్డి.
4/10
Cisco, USISPF ప్రతినిధులను కలవడం, వారితో సంభాషించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్రెడ్డి.
5/10
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్కు రావాలని ఆహ్వానించానని.. ఈ ప్రతిపాదనకు USISPF సభ్యులు అంగీకరించారని తెలిపారు సీఎం రేవంత్రెడ్డి.
6/10
గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్రం కోసం సమగ్ర దార్శనికతను ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
7/10
హైదరాబాద్ నగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
8/10
అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉద్ఘాటించారు సీఎం రేవంత్రెడ్డి.
9/10
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఢోకా లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.
10/10
దేశంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు సీఎం రేవంత్రెడ్డి.
Updated at - Nov 14 , 2025 | 08:00 AM