Tenth Exams: ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.. సంబరంగా ఇంటి బాటపట్టిన హాస్టల్ విద్యార్థులు
ABN, Publish Date - Apr 02 , 2025 | 06:39 PM
Tenth Exams: విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పదో తరగతి పరీక్షలు నేటితో పూర్తయ్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగిన ఈ పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
1/5
తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే పదో తరగతి పరీక్షలు బుధవారంతో పూర్తయ్యాయి.
2/5
మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ మొత్తం 2,650 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. 5,09,403 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
3/5
బుధవారంతో జరిగిన సోషల్ పరీక్షతో టెన్త్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సంబరాల్లో మునిగిపోయారు.
4/5
పరీక్షలు పూర్తికావడంతో హాస్టళ్లో ఉంటున్న విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. కాగా, టెన్త్ పరీక్షా ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదలవుతాయని సమాచారం.
5/5
ఈ నెల 3, 4 తేదీల్లో ఓరియంటల్ సైన్స్కు సంబంధించిన రెండు పరీక్షలు జరుగుతాయి. వీటికి కొంతమంది విద్యార్థులే హాజరవుతారని అధికారులు వెల్లడించారు.
Updated at - Apr 02 , 2025 | 06:40 PM