Chevvella Bus Tipper Truck Collision: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మృతి చెందిన విద్యార్థులకు ఘన నివాళి

ABN, Publish Date - Nov 04 , 2025 | 04:52 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖ్వాజీ గూడ సమీపంలో సోమవారం (03-11-2025)ఉదయం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ కోటిలోని ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. వీరి మరణంతో..ఆ కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

Chevvella Bus Tipper Truck Collision: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మృతి చెందిన విద్యార్థులకు ఘన నివాళి 1/6

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖ్వాజీ గూడ సమీపంలో సోమవారం (03-11-2025)ఉదయం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు.

Chevvella Bus Tipper Truck Collision: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మృతి చెందిన విద్యార్థులకు ఘన నివాళి 2/6

వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ కోటిలోని ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. వీరి మరణంతో..ఆ కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

Chevvella Bus Tipper Truck Collision: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మృతి చెందిన విద్యార్థులకు ఘన నివాళి 3/6

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో స్థానిక గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్‌కు నలుగురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం చేశారు.

Chevvella Bus Tipper Truck Collision: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మృతి చెందిన విద్యార్థులకు ఘన నివాళి 4/6

మిగిలిన ముగ్గురు కుమార్తెలు తనూష, సాయి ప్రియ, నందిని. వీరు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తూ.. ఈ ప్రమాదంలో మరణించారు.

Chevvella Bus Tipper Truck Collision: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మృతి చెందిన విద్యార్థులకు ఘన నివాళి 5/6

ఇక సాయి ప్రియతోపాటు అదే కళాశాలలో చదువుతున్న ముస్కాన్ అనే యువతి సైతం ఇదే బస్సు ప్రమాదంలో మరణించింది. దీంతో ఇద్దరు స్నేహితురాళ్లు ఈ ప్రమాదంలో మరణించడంతో వారి స్నేహితులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Chevvella Bus Tipper Truck Collision: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మృతి చెందిన విద్యార్థులకు ఘన నివాళి 6/6

కోఠి ఉమెన్స్ కాలేజీకి చెందిన ఈ విద్యార్థులకు సహచర విద్యార్థులు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. వారితో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.

Updated at - Nov 04 , 2025 | 04:58 PM