Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Aug 08 , 2025 | 05:48 PM
శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ వ్రతం ఆచరించేందుకు భక్తులు భారీగా దేవాలయాలకు తరలి వచ్చారు.
1/9
శ్రావణ శుక్రవారం.. అందునా పౌర్ణమి ఘడియలు కూడా రావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.
2/9
భక్తి శ్రద్దలతో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు ఆచరించారు.
3/9
వరలక్ష్మీ శుక్రవారం కావడంతో.. తెలంగాణ రాజధాని హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పూలతో గాజులతో అందంగా అలంకరించారు.
4/9
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని గాజులతో అలంకరించారు.
5/9
ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేకు ఈ దేవాలయానికి భక్తులు క్యూ కట్టారు.
6/9
అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గణేష్ టెంపుల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. ఈ వ్రతానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
7/9
అలాగే చందానగర్లోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సైతం శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
8/9
మరోవైపు పౌర్ణమి శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఉంది.
9/9
శుక్రవారం మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు రావడంతో.. పలు దేవాలయాల్లో శ్రీ లలిత సహస్ర నామ స్తోత్ర పారాయణంతోపాటు అమ్మవారి కుంకుమార్చనను సైతం నిర్వహిస్తున్నారు.
Updated at - Aug 08 , 2025 | 05:49 PM