MLA Naveen Yadav: ఎమ్మెల్యేగా ధృవపత్రం అందుకున్న నవీన్ యాదవ్..
ABN, Publish Date - Nov 14 , 2025 | 07:21 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. శుక్రవారం యూసుఫ్గూడలోని ఓట్ల కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఎన్నికల సంఘం అధికారుల నుంచి నవీన్ యాదవ్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
1/7
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. శుక్రవారం యూసుఫ్గూడలోని ఓట్ల కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఎన్నికల సంఘం అధికారుల నుంచి నవీన్ యాదవ్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
2/7
అనంతరం నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతోపాటు పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు.
3/7
అధిక బడ్జెట్ తీసుకువచ్చి.. జూబ్లీహిల్స్ను మరింత అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో తనను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారన్నారు.
4/7
తనను ఎమ్మెల్యేగా గెలుపించినందుకు నియోజకవర్గం ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు తనను గెలిపించుకున్నారని తెలిపారు.
5/7
నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండా అని స్పష్టం చేశారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సమయంలో కక్ష పూరిత రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. కానీ తాను అలాంటివి చెయ్యనన్నారు.
6/7
అందరినీ కలుపుకుని వెళ్లి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. మన ప్రాంత సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
7/7
తనను, తన కుటుంబం వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఓట్లు అడిగారని.. అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టిగా సమాధానం ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. రిగ్గింగ్, దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలని నవీన్ యాదవ్ వ్యాఖ్యానించారు.
Updated at - Nov 14 , 2025 | 07:22 PM