మూడంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

ABN, Publish Date - May 18 , 2025 | 06:55 PM

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లోని మైలార్ దేవుపల్లిలో మూడంతస్తుల భవనంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్నవాళ్లంతా పైన టెర్రస్ మీదకు చేరి ప్రాణాలను దక్కించుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకోగానే.. ఘటన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని.. భవనంలోని వారిని కాపాడారు.

Updated at - May 18 , 2025 | 06:56 PM