రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గందరగోళం..
ABN, Publish Date - Jun 20 , 2025 | 02:47 PM
హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గందరగోళం చెలరేగింది. వేల మంది విద్యార్థులు ధర్నాకు దిగారు.
1/6
హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద శుక్రవారం గందరగోళం చెలరేగింది.
2/6
20 అసిస్టెంట్ వార్డెన్ జాబ్స్ కోసం యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు.
3/6
సుదూర ప్రాంతాల నుంచి రెండు రోజుల ముందే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, ఇంటర్వ్యూని వాయిదా వేశారు.
4/6
దీంతో రిజిస్టర్ విద్యాసాగర్ అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ నీ వాయిదా వేశారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ధర్నాని విరమించాలి అని అభ్యర్థించినా ధర్నా విరమించలేదు.
5/6
వేల సంఖ్యలో వచ్చిన అభ్యర్థులందరూ కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ నాలెడ్జ్ సెంటర్ ముందు ధర్నాకు దిగారు. కనీసం మంచి నీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడ్డారు.
6/6
ఉన్న 20 పోస్టులను డబ్బులకు అమ్ముకున్నారంటూ అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వచ్చిన వారితోనే ఇంటర్వ్యూలు జరపాలని.. రిజిస్టర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated at - Jun 20 , 2025 | 03:02 PM