ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు
ABN, Publish Date - Apr 28 , 2025 | 07:20 AM
హనుమకొండ జిల్లా: 25వ వసంతంలోకి అడుగుపెడుతోన్న అప్పటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్.. రజతోత్సవ సభ ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగింది. ఈ సభకు భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణకు ఎప్పుడూ నంబర్వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దెబ్బతీసిందని అన్నారు.
1/6
హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రసంగించిన కేసీఆర్
2/6
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రజలకు అభివాదం తెలుపుతున్న మాజీ మంత్రి కేటీఆర్..
3/6
రజతోత్సవ సభ వేదికపై బీఆర్ఎస్ నేతలు..
4/6
హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా హాజరైన జనం..
5/6
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లుపై వచ్చిన కార్యకర్తలు..
6/6
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
Updated at - Apr 28 , 2025 | 07:21 AM