AP Ex CM Konijeti Rosaiah: హైదరాబాద్లో ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణ..
ABN, Publish Date - Jul 04 , 2025 | 06:36 PM
హైదరాబాద్లోని లక్డీకాపూల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి , సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొణిజేటి రోశయ్య కుటుంబ సభ్యులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 16 సార్లు ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతిని ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం అంటే.. జులై 04వ తేదీ ఆయన 92వ జయంతి. తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా కూడా రోశయ్య పని చేశారు.

లక్డీకాపూల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

మాజీ సీఎం రోశయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆవిష్కరిస్తున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, సీనియర్ నేతలు

రోశయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, నేతలు, కార్యకర్తలు.

రోశయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, నేతలు, కార్యకర్తలు

రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి నమస్కరిస్తున్న మంత్రి డి శ్రీధర్ బాబు.

రోశయ్య విగ్రహావిష్కరణకు హాజరైన ప్రజలు

రోశయ్య విగ్రహావిష్కరణ కోసం అక్కడికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు
Updated at - Jul 04 , 2025 | 06:42 PM