అక్షయ తృతీయ సందర్భంగా మహిళల సందడి
ABN, Publish Date - May 01 , 2025 | 08:50 AM
హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనడం మహిళలు శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఆ రోజు గోల్డ్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ సారి అక్షయ తృతీయకు రోహిణి నక్షత్రం కలిసి రావడంతో మహిళలు పెద్ద సంఖ్యలతో గోల్డ్ షాపులకు తరలి వచ్చి కొనుగోలు చేశారు. నగరంలో బంగారం షాపులన్నీ మహిలలో కలకలలాడాయి. బంగారం పెరుగుదల ఎలాంటి ప్రభావం చూపలేదు.
1/6
అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని ఓ గోల్డ్ షాపులో మహిళల సందడి..
2/6
గోల్డ్ షాపులో ఓ భారీ ఆభరణం చూసి ముచ్చటపడుతున్న మహిళ..
3/6
అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ షాపులో చెవిదిద్దులు కొనుగోలు చేసి.. చూసుకుంటున్న ఓ మహిళ..
4/6
హైదరాబాద్లోని ఓ గోల్డ్ షాపుకు కుటుంబాలతో సహా వచ్చి సందడి చేశారు.
5/6
గోల్డ్ షాపులో ఓ ఆభరణం చూసి.. మెడలో వేసుకుని చూసుకుంటున్న మహిళ..
6/6
హైదరాబాద్లోని ఓ గోల్డ్ షాపుకు వచ్చిన జనం..
Updated at - May 01 , 2025 | 08:51 AM