పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు
ABN, Publish Date - May 07 , 2025 | 07:38 AM
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత సైనికులు మెరుపు దాడి చేశారు. 9 స్థావరాలను ధ్వంసం చేశారు.

పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది.

భారత్ సైనికుల మెరుపుదాడులతో పాకిస్గాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడిన భారత్..

పాక్లోకి 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సేనలు..

పహల్గాం దాడిపై ప్రతీకారం తీర్చుకుంటున్న భారత సైన్యం..

భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూ స్టార్ట్..
Updated at - May 07 , 2025 | 07:38 AM