Rathasapthami vedukalu: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు
ABN, Publish Date - Feb 04 , 2025 | 08:42 PM
Rathasapthami vedukalu in Arasavalli: శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య నారాయణుడిని పూజించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు.
1/8
స్వామి వారిని దర్శించుకొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు దంపతులు
2/8
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడిని దర్శించుకొనేందుకు భక్తులతోపాటు ప్రముఖులు సైతం పోటెత్తారు.
3/8
స్వామి వారిని దర్శించుకొనేందుకు వస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్
4/8
స్వామి వారి దర్శనం కోసం సంప్రదాయ దుస్తుల్లో వస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే గొండు శంకర్
5/8
దేవాలయం వద్ద భక్తులకు పాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే గొండు శంకర్
6/8
సూర్య భగవానుడిని దర్శించుకొనేందుకు వచ్చిన అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైసీపీ ఎమ్మెల్సీ వరుధు కళ్యాణి
7/8
దేవాలయం వద్ద క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్
8/8
క్యూ లైన్లలో భక్తులతో మాట్లాడుతోన్న జిల్లా ఎస్పీ కె వి మహేశ్వర రెడ్డి
Updated at - Feb 04 , 2025 | 08:53 PM