Chittaramma Jatara: భక్తుల కొంగుబంగారం.. చిత్తారమ్మ దేవి
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:45 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలో కొలువై భక్తుల కొంగుబంగారంగా భావించే చిత్తారమ్మదేవి జాతర కన్నుల పండువగా జరుగుతోంది. సంక్రాంతి తర్వాత ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు. జనవరి 17 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ జాతర జరుగుతోంది. 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేలా దేవాలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
1/9
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలో కొలువై భక్తుల కొంగుబంగారంగా భావించే చిత్తారమ్మదేవి జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.
2/9
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలో కొలువై భక్తుల కొంగుబంగారంగా భావించే చిత్తారమ్మదేవి జాతర కన్నుల పండువగా జరుగుతోంది.
3/9
సుమారుగా 5 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు చెబుతున్నారు.
4/9
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
5/9
జాతరకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
6/9
జాతరలో ఏర్పాటు చేసిన స్టాల్స్, రంగుల రాట్నాలు, జెయింట్ వీల్స్, జారుడు స్పాంజ్లు చిన్నపిల్లలను అలరించాయి.
7/9
అమ్మవారి చల్లని దీవెనలతో జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన భక్తులకు, ఆలయ సిబ్బందికి చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.
8/9
భక్తుల కోసం జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిరంతర విద్యుత్ సరఫరా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైద్యసేవలు, టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి గాజులరామారానికి ప్రతి అరగంటకు ఒక స్పెషల్ బస్సు నడిపారు.
9/9
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఉదయం నుంచే ఆలయం వద్ద జీడిమెట్ల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated at - Jan 20 , 2025 | 05:08 PM