Republic day: అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ABN, Publish Date - Jan 26 , 2025 | 01:20 PM
ఆంధ్రప్రదేశ్: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
1/10
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
2/10
రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
3/10
ముందుగా ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు.
4/10
సాయుధ దళాల కవాతు అనంతరం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను గవర్నర్ ఎగరవేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
5/10
ఏడు నెలలకు ముందు ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని గవర్నర్ చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను డైవర్ట్ చేయడంతో ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని వెల్లడించారు.
6/10
ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, 93 శాతం స్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని గౌవర్నర్ పేర్కొన్నారు.
7/10
పోలవరం, రాజధాని అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఏపీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేలా చేస్తున్నారని అబ్దుల్ నజీర్ చెప్పారు.
8/10
స్వర్ణాంధ్ర-2047కు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని, ఆరోగ్య, ఐశ్వర్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ చెప్పారు.
9/10
ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శించారు.
10/10
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రులు నారా లోకేశ్, సవిత, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి, సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు.
Updated at - Jan 26 , 2025 | 01:20 PM