తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 09:44 AM
Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినాన స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు.
1/7
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
2/7
సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడి అభయం
3/7
ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
4/7
ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం.
5/7
అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం.
6/7
భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.
7/7
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి , పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated at - Feb 04 , 2025 | 09:46 AM