అరసవల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 10:18 AM
శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు.

శ్రీకాకుళం, అరసవల్లి సూర్యనారాయయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు.

అరసవల్లిలో బందోబస్తు విధులు నిర్వహణ, ఏర్పాట్లపై ఆరా తీస్తున్న విశాఖపట్నం డిఐజి గోపీనాథ్ జట్టి..

ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి నిజరూప దర్శనం చేసుకున్న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యాం ప్రసాద్

కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకున్న టెక్కలి రెవిన్యూ డివిజనల్ అధికారి..

సూర్యనారాయణ స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకున్న భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సతీమణి

స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకున్న శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యుడు గొండు శంకర్
Updated at - Feb 04 , 2025 | 10:18 AM