Pawan Kalyan: వృద్ధురాలి ప్రేమకు ముగ్ధులైన పవన్ కల్యాణ్
ABN, Publish Date - May 10 , 2025 | 11:19 AM
గత సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం వేగులమ్మ అమ్మవారికి మొక్కుకుని, తన పింఛను సొమ్ముతో ఆ మొక్కు చెల్లించిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాదాభివందనం చేశారు. ఆమెను గుండెలకు హత్తుకుని.. స్వయంగా భోజనం వడ్డించారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ గ్రామదేవత వేగులమ్మ అమ్మవారికి పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు మొక్కులు మొక్కారు.

దీనికోసం నెలనెలా తనకు వచ్చే పింఛను సొమ్ములో కొంత దాచి రూ.27 వేలతో అమ్మవారికి గరగ చేయించి పోతుల పేరంటాలు మొక్కు చెల్లించుకున్నారు.

ఒంటరి జీవితం గడుపుతూ సొంత ఇల్లు కూడా లేని ఆ అవ్వ గురించి తెలుసుకుని.. ఆమెను మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి తీసుకురావాలని అనుచరులను ఆదేశించారు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ పేరంటాలని శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఆమెతో ముచ్చటించారు.

తనపై చూపిన మమకారానికి పవన్ కల్యాణ్ ముగ్దులయ్యారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనపై చూపిన ప్రేమకు ఆ వృద్ధురాలు ఆనందంతో పొంగిపోయింది.

శుక్రవారం మంగళగిరికి వచ్చిన ఆమెను చూసి పవన్కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. తనతో కలిసి భోజనం చేయాలనే అవ్వ కోరికను పవన్కల్యాణ్ నెరవేర్చారు.

అవ్వను ఆత్మీయంగా పలుకరిస్తూ స్వయంగా పవన్ కల్యాణ్ భోజనం వడ్డించారు

వృద్ధురాలు పోతుల పేరంటాలకు చీర బహూకరించి, రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పవన్ కల్యాణ్ అందజేశారు.

గ్రామంలో అమ్మవారి గుడిని పునరుద్ధరించాలని పోతుల పేరంటాలు పవన్ కల్యాణ్కు విజ్ఞప్తి చేసింది. వారంలో పని మొదలుపెడతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

పోతుల పేరంటాలతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

పోతుల పేరంటాలు తన స్వగ్రామానికి వెళ్లడానికి పవన్ కల్యాణ్ ఓ వాహనం ఏర్పాటు చేశారు. ఆ వాహనం వరకు స్వయంగా వచ్చి ఆమెను పవన్ కల్యాణ్ పంపించారు.
Updated at - May 10 , 2025 | 11:45 AM