Nara Bhuvaneswari: శాంతిపురం మండలంలో బీసీ మహిళ ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేసిన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Nov 22 , 2025 | 07:31 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పం పర్యటనలో భాగంగా మొదటి రోజు శాంతిపురం మండలం చెల్దిగానిపల్లిలో నారా భువనేశ్వరిని కలిసిన లక్ష్మమ్మ అనే బీసీ మహిళ తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి.. లక్ష్మమ్మ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు.
1/6
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
2/6
స్థానిక ప్రజలతో నారా భువనేశ్వరి మమేకం అవుతున్నారు.
3/6
మొదటి రోజు శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి పర్యటనలో నారా భువనేశ్వరిని కలిసిన లక్ష్మమ్మ అనే బీసీ మహిళ తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు.
4/6
తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి.. లక్ష్మమ్మ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు.
5/6
తాము ఎంతో ఆరాధించే సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తమ ఇంటికి రావడంతో లక్ష్మమ్మ కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.
6/6
భువనేశ్వరిని సాదరంగా స్వాగతించి చీరను బహుకరించారు. వారి యోగక్షేమాలు కనుక్కుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు.
Updated at - Nov 22 , 2025 | 10:37 AM