Mangli: శ్రీకాకుళం జిల్లాలో అలరించిన మంగ్లీ పాటలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 08:54 AM
శ్రీకాకుళం జిల్లాలో సాంస్కృతిక సంబరం ముగిసింది. ఈ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాటలు పాడుతూ ఉర్రూతలూగించారు. అలాగే నృత్య ప్రదర్శనలు కూడా అలరించాయి. ప్రజలు భారీగా పాల్గొని సందడి చేశారు.
1/5
రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్బంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి.
2/5
ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం ఆద్యంతం ఆహుతులకు కనువిందు చేసింది.
3/5
సినీ గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరగా క్రాకర్స్షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. వివిధ భక్తి పాటలకు మంగ్లీ పాడగా ఆహుతులను ఆకట్టుకున్నాయి.
4/5
ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా, తర్వాత వరుసగా, సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు , మావూడూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి .
5/5
మంగ్లీ గానలహరి మనోరంజకంగా సాగింది. ‘మా ఊరు శ్రీకాకుళం...మేమంతా శ్రామికులం’ అంటూ ఆమె పలు గీతాలను పాడి అందర్నీ అలరించారు.
Updated at - Feb 04 , 2025 | 08:54 AM