శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు
ABN, Publish Date - Dec 22 , 2025 | 02:00 PM
సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భారత అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యుల బృందం దర్శించుకుంది. సోమవారం ఉదయం స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్న ఈ బృందానికి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
1/5
సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భారత అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యుల బృందం దర్శించుకుంది. సోమవారం ఉదయం స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్న ఈ బృందానికి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
2/5
అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత అంతరాలయంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని వారు దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3/5
స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ మండపంలో క్రీడాకారిణులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంలతో ఘనంగా సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
4/5
స్వామి వారిని దర్శించుకున్న వారిలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణులు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, రేణుక సింగ్, షఫాలీ వర్మ, వైష్ణవి శర్మ, అమర్ ప్రీత్ కౌర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, అంపైర్ డి.ఎస్. లక్ష్మి, బృందా రాతి తదితరులు ఉన్నారు.
5/5
దేశానికి మరిన్ని విజయాలు చేకూరాలని, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని ఈ సందర్భంగా వారు కోరుకున్నారు. ఈ క్రీడాకారిణులకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి. తిరుమలేశ్వరావు, పర్యవేక్షణ అధికారి కె. వెంకటేశ్వరరావు తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Updated at - Dec 22 , 2025 | 02:11 PM