కుప్పం ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై సమస్యలకు పరిష్కారం అక్కడే..
ABN, Publish Date - Jan 07 , 2025 | 05:07 PM
కుప్పం నియోజకవర్గ ప్రజలు సమస్యలు చెప్పుకుని వినతిపత్రాలు సమర్పించేందుకు వీలుగా ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
1/7
కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
2/7
కుప్పం నియోజకవర్గ ప్రజలు సమస్యలు చెప్పుకుని వినతిపత్రాలు సమర్పించేందుకు వీలుగా ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
3/7
సమస్యలు, ఫిర్యాదులను ‘జన నాయకుడు’ పోర్టల్లో రిజిస్టర్ చేసేలా వెబ్సైట్ను సైతం రూపొందించారు.
4/7
ప్రజల ఫిర్యాదులు స్వీకరించి ఏ విధంగా ఆన్లైన్ చేసి ట్రాక్ చేస్తారనే అంశాలను అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు.
5/7
అనంతరం ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
6/7
కార్యక్రమానికి ముందు టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు మహిళలు హారతి ఇచ్చి ఘనస్వాగతం పలికారు.
7/7
అనంతరం మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు.
Updated at - Jan 07 , 2025 | 05:07 PM