TDP Mahanadu 2025: కడప గడపలో మహానాడు..
ABN, Publish Date - May 27 , 2025 | 02:26 PM
కడప నగరం వేదికగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. పార్టీ కార్యకర్తల రక్త దాన శిబిరాన్ని సైతం ఆయన ప్రారంభించారు. ప్రాంగణంలోకి వచ్చిన ఆయన చిత్తూరు పార్లమెంట్ నమోదు శిబిరంలోకి వెళ్లి తన పేరును సీఎం చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక వేదికపైకి వచ్చిన ఆయన.. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి టీడీపీ జండాను సీఎం చంద్రబాబు ఎగురవేశారు.
1/11
కడప వేదికగా మహానాడు మంగళవారం ప్రారంభమైంది. ఈ సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు.
2/11
మహానాడు వేదికపై పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడితో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్
3/11
మహానాడు వేదికపై ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు
4/11
వేదికపై చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. ఆయనకు హరతి ఇస్తున్న టీడీపీ మహిళా కార్యకర్త.
5/11
వేదికపై నుంచి ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు
6/11
తన వాహనంపై మహానాడు వేదికకు చేరుకున్న టీడీపీ సీనియర్ నేత
7/11
తన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు నాయుడు.
8/11
పార్టీ చీఫ్, సీఎం చంద్రబాబు మెడలోని పసుపు కండువాకు టీడీపీ బ్యాడ్జి పెడుతున్న విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు.
9/11
పార్టీ అభిమానితో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు
10/11
మహానాడు ప్రాంగణంలోని ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు.
11/11
మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఫొటోలను తిలకిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.
Updated at - May 27 , 2025 | 02:48 PM