నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు..

ABN, Publish Date - Feb 27 , 2025 | 12:23 PM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్‌ జరగనున్నది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకు ముగియనున్నది. అందుకు తగిన ఏర్పాట్లు అధికారులు పూర్తిచేశారు.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు.. 1/7

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్‌ జరగుతుంది.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు.. 2/7

ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3/7

ఈ ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా విశాఖ కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు.. 4/7

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల రెవెన్యూ అధికారులు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా ఉన్నారు.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు.. 5/7

ఆరు జిల్లాల పరిధిలో 22,493 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు.. 6/7

ఉన్నత పాఠశాలల్లో బోధించే స్కూల్‌ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు, కేజీబీవీలు, రెసిడెన్సియల్‌, మోడల్‌ స్కూళ్లు, జూనియర్‌/డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌, యూనివర్సిటీ కళాశాలల అధ్యాపకులు, ప్రైవేటు పాఠశాలలకు చెందిన స్కూలు అసిస్టెంట్‌ కేడర్‌లో ఉన్న టీచర్లు ఓటు హక్కును వినియోగించునుకోనున్నారు.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు.. 7/7

వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్‌ సిబ్బందికి రెండు రోజుల్లో శిక్షణ ప్రారంభమవుతుంది.

Updated at - Feb 27 , 2025 | 12:24 PM