Share News

Revanth Reddy: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో తెలంగాణ సీఎంతో ‘మీట్ అండ్ గ్రీట్’

ABN , Publish Date - Jan 20 , 2025 | 08:00 PM

సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఎమ్మెల్యేలతో తెలంగాణ కల్చరల్ సొసైటీ జనవరి 18న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించింది.

Revanth Reddy: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో తెలంగాణ సీఎంతో ‘మీట్ అండ్ గ్రీట్’

ఎన్నారై డెస్క్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) జనవరి 18న సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించింది. వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ (జీఐఐఎస్) స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం అనుముల రేవంత్ రెడ్డితో పాటు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్,ఇండస్ట్రీస్, కామర్స్,లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగార్జున సాగర్ ఎంఎల్ఏ జయవీర్ కుందూరు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎంఎల్ఏ, మాజీ అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, అధ్యక్షులు గడప రమేష్ బాబు, ముఖ్య అతిథులు, సింగపూర్ తెలుగు ప్రజల సమక్షంలో అతిథి మర్యాదలతో స్వాగతం పలికారు (NRI).

1.jpg


TPAD: యూఎస్ఏలో వైభవంగా తెలంగాణ పీపుల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డాలస్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నారుల నృత్యప్రదర్శనతో, స్వాగత గీతంతో ఆహ్వానించారు. తరువాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షులు గడప రమేశ్ తన స్వాగత ప్రసంగంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ స్థాపన, తెలుగు సంప్రదాయాలను, ఆచారాలను, ఆధ్యాత్మిక తత్వాలను భావితరాలకు అందించే కృషిలో సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ మీద ఉన్న ప్రేమను చూపించడానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, రోహిణ్ కుమార్ రెడ్డికి, ఇతర సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

IIPA: ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఆవార్డు గ్రహితకు సౌదీలో ఐఐపీఏ సన్మానం

తెలంగాణ కల్చరల్ సొసైటీకి వెన్నంటి నడిపించి తమ సహాయ సహకారాలను ఎల్లవేళలా అందించే వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్‌, ఎన్నారై సెల్ మంద భీంరెడ్డి, జీటీఏ గ్లోబల్ ఛైర్మెన్ కల్వల విశ్వేశర్ రెడ్డి, జీఐఐఎస్ ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్‌లకు, ఈ కార్యక్రమానికి సహకరించిన బసిక శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి తెలంగాణలో పలు రంగాలలో చేస్తున్న అభివృద్ధిని, తెలంగాణ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే ప్రణాళికను, ప్రపంచదేశాలు తెలంగాణను తలెత్తి చూసే సమయం ఆసన్నమయ్యిందని అన్నారు. ఈ దిశగా విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ, తెలుగు ప్రజల సహాయ సహకారాలు ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిజిటల్ రంగంలో చేస్తున్న అభివృద్ధిని వివరించారు .

3.jpg


సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును, ఇతర మంత్రివర్గ సభ్యులను, అతిథులందర్నీ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) కమిటి, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, జీఐఐఎస్ ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్ ఘనంగా సత్కరించారు.

ఈ వేడుకల్లో మాతృశ్రీసాయి ఇన్‌స్టిట్యూట్, సర్వ ఫైన్‌ఆర్ట్స్, దుర్గ శర్మ గ్రూప్, దీపారెడ్డి అండ్ గ్రూప్, స్వర్ణకళామందిర్ నుండి చిన్నారుల నృత్యప్రదర్శనలు, మధురమైన గీతాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

TASA: టాసా వెబ్‌సైట్‌ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఈ కార్యక్రమానికి కాసర్ల శ్రీనివాస రావు, మిర్యాల సునిత రెడ్డి ముఖ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి అందరిని అలరించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షలు రత్న కుమార్ కవుటూరు, తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యుల చేతుల మీదుగా 2025 తెలుగు క్యాలెండర్ (సింగపూర్ కాలమాన ప్రకారం) ను విడుదల చేసి సభ్యులకు, హాజరైన వారికి పంపిణీ చేసి సంతోషం వ్యక్తపరిచారు

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, ముఖ్య అతిథులు, ఇతర అనుబంధ సంస్థలకు, కార్యక్రమ ఏర్పాటులో తోడ్పడిన సొసైటీ సభ్యులు ఆలెక్స్ తాళ్ళపల్లి, మల్లారెడ్డి కళ్లెం, లక్ష్మణ్ రాజు కల్వ, రాకేష్ రెడ్డి రజిది, సురేందర్ రెడ్డి గింజల, సింగపూర్ తెలుగు ప్రజలకు అభినందనలు తెలియజేశారు.

4.jpg

UAE: యుఏఈలో సంక్రాంతి సంబరాలు

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ మొదలగు వారు 'మీట్ అండ్ గ్రీట్' కు హాజరైన ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు.

సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల, కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, వాసవి పెరుకు, రావుల మేఘన, చల్ల లత మొదలగు వారు మీట్ అండ్ గ్రీట్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.

5.jpg6.jpgRead Latest and NRI News

Updated Date - Jan 20 , 2025 | 08:05 PM