Share News

CM Chandrababu In Dubai: 9 ఏళ్ళ హాంశ్ నుండి 92 ఏళ్ళ ఫాతిమా వరకు..

ABN , Publish Date - Oct 26 , 2025 | 07:24 PM

దుబాయి పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమతో సమావేశం కావడం పట్ల ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

CM Chandrababu In Dubai: 9 ఏళ్ళ హాంశ్ నుండి 92 ఏళ్ళ ఫాతిమా వరకు..

దుబాయి చంద్రబాబు నాయుడు పర్యటన విశేషాలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గంలో సభ్యునిగా నుంచి మొదలు నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దుబాయితో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. దుబాయి అభివృద్ధిను నిశితంగా గమనించే భారతీయ నాయకులలో ఆయన అగ్రగణ్యుడు సీఎం చంద్రబాబు. తన సుదీర్ఘ ప్రజాజీవితంలో ఆయన అనేక సార్లు దుబాయిను సందర్శించినా స్ధానికంగా ఉన్న తెలుగు ప్రవాసీయులను ఎప్పుడు కలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు.


CBN-2.jpg

ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు నాయుడు దుబాయిలో ప్రవాసీయుల సభతో గత ముప్పయి సంవత్సరాలుగా ఉన్న లోటును పూడ్చడమే కాకుండా రానున్న మరో ఇరవై సంవత్సరాల వరకు ముందస్తు కూడ చెల్లించారని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు సహజంగా దూరంగా ఉండెే దుబాయి, ఇతర గల్ఫ్ దేశాలలో ఈ రకమైన సాముహిక సమావేశాలు జరగడం అత్యంత అరుదు. 1990 దశకంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, 2010లలో తెలంగాణ ధూంధాం 2015లో ప్రధాని నరేంద్ర మోదీల సభలు ఈ అత్యంత అరుదైన జాబితాలోకి వస్తాయి. కానీ ఈ మూడింటిలోనూ ఎక్కడ కూడ సభా వేదికపైకి సామాన్యులే కాదు నాయకులు సైతం వెళ్ళడానికి వీలు లేదు. దుబాయిలో జన్మించిన తొమిదెళ్ళ వేమూరి హంశ్ నుంచి మొదలు కాకినాడలో పుట్టి పెరిగి దుబాయిలో స్ధిరపడ్డిన 92 ఏళ్ళ ఫాతిమా వరకు సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.


CBN-1.jpgసువిశాల ఆంధ్రప్రదేశ్‌ను ఏ రకంగా పరిపాలిస్తారని హంశ్ ప్రశ్నించగా, 1965 భారత-పాకిస్తాన్ యుద్ధంలో జాతికు తన బంగారాన్ని విరాళమిచ్చిన అలనాటి కాకినాడ లేడీస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఫాతీమా ఆంధ్రప్రదేశ్‌ను దుబాయి తరహాలో తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబును ఆశ్వీర్వదించారు. హాంశ్ వేదిక పైఎక్కి ప్రశ్నించగా.. సీఎం చంద్రబాబు నాయుడు వేదిక దిగి వీల్ చెయిర్ వద్దకు వెళ్ళి ఫాతీమా బీను కలిశారు. దుబాయిలోని ప్రవాసాంధ్ర ప్రముఖుడు జాఫర్ అలీ తల్లి ఈ ఫాతీమా బీ.


CBN-3.jpgఒక్క దుబాయే కాదు.. విదేశాలలో ఎక్కడ కూడ లేని విధంగా ఈ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేదికపై సుమారు ఐదు గంటల పాటు ఎలాంటి అలసట లేకుండా నిల్చుని అందర్ని విడి విడిగా కలిసి మాట్లాడి వారితో ఫోటోలు దిగారు. నవాజ్ షరీఫ్, నరేంద్ర మోదీల చుట్టు పూర్తి భద్రత వలయం ఉండగా జనాలతో కిక్కిరిసిన తెలంగాణ ధూంధాంకు కరుడుగట్టిన వాలంటీర్లు అడ్డుగా ఉన్నారు. కానీ బ్లాక్ క్యాట్ల భద్రతలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం సాదాసీదాగా అందరితోనూ కలిసిపోయారు.


సీఎం చంద్రబాబు నాయుడు పక్కన ఒక వైపు ఆయన భద్రత సిబ్బంది.. మరో వైపు తెలుగుదేశం గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధకృష్ణాలను సైతం ఆయన వారిస్తూ అందరితో కరచాలనం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఓపికగా అందర్ని కలిసిన తీరుకు సభికులు మంత్రమగ్ధులయ్యారు. సౌదీ అరేబియా నుండి వచ్చి తనను కలిసిన గడ్డం శిల్పా, చెన్నుపాటి అక్షితలతో అప్యాయంగా మాట్లాడుతూ అంతకు ముందు వారు తనను విజయవాడలో కూడ కలిసిన విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు గుర్తు చేయడంతో వీరిద్దరు ఆయన జ్ఞాపకశక్తిని గమనించి అశ్చర్యపోయారు.


CBN-4.jpgసౌదీ అరేబియా నుంచి బారీ సంఖ్యలో 25 మంది వచ్చారు. అలాగే కువైట్త్, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్ దేశాల నుండి సైతం ప్రవాసీయులు ఈ సమావేశానికి తరలి వచ్చారు. ఇప్పుడిప్పుడెే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన నవ యువకులు మొదలు 1970 దశకంలో బొంబాయి నుండి ఓడ ఎక్కి కువైట్‌కు వచ్చిన ములకల సుబ్బరాయుడు వరకు ఈ సమావేశానికి వచ్చిన వారిలో ఉన్నారు. మోబైల్ ఫోన్లు మీటలు నొక్కుతూ తెలిసి తెలియని లేదా పరిమిత జ్ఞానంతో తమకు అన్ని తెలుసు అన్నట్లుగా వ్యవహరించెే ప్రస్తుత యువతరం విమానశ్రాయం టర్మినల్‌లో నాలుగు అడుగులు ఎక్కువ వేసి బయటకు వచ్చే సరికి భౌతికంగా అలిసి పోయే వీరు సీఎం చంద్రబాబు నాయుడులోని లక్షణాలను చూసి అశ్చర్యపోయారు.


CBN-5.jpgరాజకీయాలకు అతీతంగా ఆయన చేసిన ఉపన్యాసం, అవిష్కరించిన మనోగతం వేలాది మంది హృదయాలను ఆకట్టుకోంది. ప్రవాసీయులు ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా అక్కడి సంప్రదాయాలను, చట్టాలను గౌరవిస్తూ మెలుగాలని హితువు పలుకడం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ప్రారంభించడం ఒక్క దుబాయిలోని తెలుగు వారికి మాత్రమే కాకుండ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు ఒక సందేశాన్ని పంపారు. అమెరికాతో సహా కొన్ని దేశాలలో దీపావళీ లేదా ఇతర పండుగల ఉత్సవాల సందర్భంగా హద్దులు మీరుతూ వ్యవహరించిన తీరుపై వెలువడిన కథనాల కారణాన ఒక దార్శనికుడిగా సీఎం చంద్రబాబు హితోపదేశానికి ప్రాధాన్యత ఉంది.


11.jpg

వర్షాలు కూడా పడని దుబాయి అభివృద్ధిను ఒకప్పుడు ఎవరు కూడ ఉహించ లేదని అదే విధంగా రైతు బిడ్డలు ఐటి ఇంజినీర్లుగా ఎదుగుతారని కూడ ఒకప్పుడు ఉహించలేదని కానీ దూరదృష్టి, భవిష్యత్తుకు భరోసా అనే దృక్పథంతో ఇది సాధ్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. చమురు ఆదాయం లేని దుబాయికు పర్యాటక రంగం ప్రధాన ఆదాయ వనరు కాగా కేవలం ఒక్క విమానశ్రాయాన్ని ఆధారితం చేసుకోని దుబాయి ఏమిరేట్ పర్యాటక రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆయన ప్రత్యక్ష అనుభవాలను ఉదహరిస్తూ వివరించారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఒక లక్షా యాభై వేల హోటల్ రూంలతో పర్యాటక రంగాన్ని ఈ ఇసుక ఎడారి నగరం అభివృద్ధి చేసిన తీరును వివరిస్తూ నీళ్ళు, చెట్లు లేని దుబాయి శరవేగంగా ప్రగతిలో పురోగమిస్తుండగా అన్ని ఉండి తామెందుకు వెనుకబడి ఉంటున్నామో అలోచించాలని ఆయన అన్న మాటలు అందర్ని అలోచింప జేసాయి. తాను ఇంటికు ఒక్కరు చొప్పున ఐటీ ఇంజినీర్‌ను చేస్తానని 1990లలో ప్రకటిస్తే హేళన చేసిన వారున్నారని గుర్తు చేశారు. రానున్న తరానికి కావల్సిన క్వాంటం కంప్యూటింగ్‌కు తాను నవ్యాంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుట్టనున్నట్లుగా హర్షధ్వానాల మధ్య సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.


3.jpg

ఎంత అశేష ప్రజాభిమానం కలిగిన నాయకులు వచ్చినా సభ నిర్వహణ తీరు సరిగ్గా లేని పక్షంలో వృధా అవుతుంది, దుబాయిలో మాత్రం తెలుగుదేశం గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా అధ్వర్యంలో పార్టీ స్ధానిక నాయకులు ముక్కు తులసీ కుమార్, విశ్వేశ్వరావు, వాసురెడ్డి, రాజ రవికిరణ్, బాషా, స్ధానిక ప్రముఖులు సునీల్ బొయపాటిలు, ఇతర వాలంటీర్లు ఓర్పు, సహానంతో రేయింబవళ్ళు కష్టపడ్డారు. వీరికి దన్నుగా అటు మంగళగిరిలో ఎపీ ఎన్నార్టీ ప్రవాసీ సంస్ధ నిలిచింది. విజయవాడలో పార్టీ ప్రముఖులు వేమూరి రవి, బుచ్చిరాం ప్రసాద్ కూడ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చారు. దుబాయిలోని తెలుగుదేశం పార్టీ నాయుకులు వచ్చిన ప్రతి ఒక్కర్ని అప్యాయతతో సాదర స్వాగతం పలికారు. వీరెవరికి కూడా మాతృభూమిలో కంట్రాక్టులు లేదా రాజకీయ పదవుల ఆరాటం లేదు. రాజకీయం అనేది సంపూర్ణ వ్యాపారమైన ఈ కాలంలో ఒక అభిరుచితో మాత్రమే తమ ఉద్యోగాలు చేసుకోంటూ ఎడారిలో పసుపు జెండాను మోస్తున్నారు.


దుబాయిలోని బిర్యానీ మోర్స్ హోటల్‌లో అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను నిర్వహించుకోనే వీరికి చంద్రబాబు నాయుడు సభ విజయవంతం కావడంతో పార్టీను క్షేత్రస్ధాయిలో విస్తరించెే బాధ్యత భుజస్కంధాలపై పడింది. సరిగ్గా అదే రకమైన సమబాధ్యత పార్టీ నాయకత్వంపై కూడా ఉంది. సభకు ముందు ఉదయం హోటల్‌లో వేమూరు రవి, రావి రాధాకృష్ణాల నాయకత్వంలో పార్టీ నాయకులతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు చేసిన దశ, దిశా నిర్దేశం ఎడారిలో పార్టీను మరింత బలోపేతం చేస్తుందని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు.


ముఖ్యమంత్రి సమావేశం దుబాయిలోని తెలుగు సంఖ్యా బలాన్ని చాటి చెప్పింది. ప్రప్రధమంగా దుబాయి, ఉత్తరాది ఏమిరేట్లలో భారీ సంఖ్యలో ఔత్సిహిక తెలుగు ప్రవాసీయులను చూసి అశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగిందని దుబాయిలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సతీష్ కుమార్ శివన్ ఈ విలేకరితో మాట్లాడుతూ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఇల్లు శుభ్రం చేయని భర్తపై కత్తితో దాడి.. యూఎస్‌లో భారత సంతతి మహిళ అరెస్టు

చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం

Read Latest and NRI News

Updated Date - Oct 26 , 2025 | 10:22 PM