Mineral Water: మూతల రంగుల్లో మర్మం ఇదే..
ABN , Publish Date - May 10 , 2025 | 03:45 AM
వాటర్ బాటిళ్లపై ఉన్న రంగురంగుల మూతలు వాటి లోపల ఉన్న నీటి రకాన్ని తెలియజేస్తాయి. నిపుణుల ప్రకారం, ప్రతి రంగు ఒక నిర్దిష్టమైన నీటి వర్గాన్ని సూచిస్తుంది.

మనం సాధారణంగా బయటికి వెళ్లినప్పుడు లేదా ప్రయాణాల్లో దాహమనిపిస్తే వెంటనే వాటర్ బాటిల్ కొనుక్కుని నీళ్లు తాగేస్తూ ఉంటాం. ఈ బాటిళ్లకు పలు రంగుల మూతలు ఉండడాన్ని చాలామంది గమనించే ఉంటారు. ఈ రంగు మూతలు ఆ బాటిళ్లలోని నీటి గురించి తెలియజేస్తాయంటున్నారు నిపుణులు. ఆ వివరాలు...
నీలం: మనకు తరచుగా లభ్యమయ్యే వాటర్ బాటిళ్లకు నీలం రంగు మూతలు ఉంటాయి. అంటే ఆ బాటిళ్లలోని నీటిని నదులు, చెరువులు లాంటి సహజ వనరుల నుంచి సేకరించి శుద్ధి చేశారని అర్థం. ఈ నీటిలో లవణాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే ఈ నీటిని ‘మినరల్ వాటర్’ అంటారు.
ఆకుపచ్చ: ఇవి కాస్త అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. పెద్ద సూపర్ మార్కెట్లలో, షాపింగ్ మాల్స్లో, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఇవి లభ్యమవుతాయి. ఆకుపచ్చ మూత ఉంటే ఆ బాటిల్లో ఉన్నది ‘ఫ్లేవర్డ్ వాటర్’ అని అర్థం. కొన్ని రకాల నేచురల్ ఫ్లేవర్స్ను స్వల్ప మోతాదులో కలపడం వల్ల ఈ నీరు ప్రత్యేకమైన రుచితో ఉంటుంది.
నలుపు: నలుపు రంగు మూత ఉన్న వాటర్ బాటిల్స్ కూడా అరుదుగానే కనిపిస్తాయి. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. వీటిని సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు కొంటూ ఉంటారు. నల్లని మూత ఉంటే ఆ బాటిల్లో ఉన్నవి... ‘ఆల్కలైన్ కలిపిన నీళ్లు’ అని అర్థం. ఈ నీళ్లు తాగితే కడుపులో ఆమ్లత్వం, ఇతర జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో క్షార పదార్థాలు, మినరల్స్ కూడా కలుపుతారు.
తెలుపు: తెల్లని మూత ఉన్న వాటర్ బాటిల్స్ సాధారణంగా అన్ని చోట్లా దొరుకుతూనే ఉంటాయి. వీధి చివరన ఉండే చిన్న కొట్లు, కిరాణా షాపులు, కూల్డ్రింక్ షాపులు, బస్టాండ్లలో ఇవి విరివిగా లభ్యమవుతూ ఉంటాయి. తెలుపు మూత ఉంటే ఆ బాటిల్లో ఉన్నవి ‘బాగా శుద్ధి చేసిన నీళ్లు’ అని అర్థం. వీటిలో ఎటువంటి మినరల్స్ ఉండవు. కేవలం దాహం తీర్చుకోవడానికి పనికొస్తాయి.
పసుపు, ఎరుపు, గులాబీ రంగులు: పసుపు రంగు మూత ఉంటే ఆ నీళ్లు విటమిన్లు, ఎలకొ్ట్రలైట్లు కలిపినవనీ; ఎరుపు రంగు మూత ఉంటే అవి కార్బొనేటెడ్ నీళ్లు అనీ తెలుసుకోవచ్చు. గులాబీ రంగు మూత ఉంటే అది నీటిని గురించి తెలియజేసేది కాదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ఉద్దేశించినది.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి