Share News

Ernakulam Express: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‏కు తప్పిన ముప్పు.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:45 PM

కరూర్‌ జిల్లా తిరుకాంబులియూర్‌ ప్రాంతాల్లో రైలు పట్టాలపై ఏర్పడిన పగుళ్లను సకాలంలో గుర్తించడంతో ఎర్నాకుళం-కారైక్కాల్‌ ఎక్స్‌ప్రెస్‌(Ernakulam-Karaikkal Express)కు ప్రమాదం తప్పింది.

Ernakulam Express: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‏కు తప్పిన ముప్పు.. అసలేం జరిగిందంటే..

- రైలు పట్టాలపై పగుళ్లు

చెన్నై: కరూర్‌ జిల్లా తిరుకాంబులియూర్‌ ప్రాంతాల్లో రైలు పట్టాలపై ఏర్పడిన పగుళ్లను సకాలంలో గుర్తించడంతో ఎర్నాకుళం-కారైక్కాల్‌ ఎక్స్‌ప్రెస్‌(Ernakulam-Karaikkal Express)కు ప్రమాదం తప్పింది. తిరుకాంబులియూర్‌ మార్గంలో మంగళవారం ఉదయం రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి కలియమూర్తి వెళ్తున్న సమయంలో, రైలు పట్టాలపై పగుళ్లను గుర్తించాడు. కలియమూర్తి ఈ విషయాన్ని వెంటనే గ్యాంగ్‌మెన్‌లకు తెలియజేశాడు. అదే సమయంలో వస్తున్న ఎర్నాకుళం-కారైక్కాల్‌ ఎక్స్‌ప్రె్‌సకు గ్యాంగ్‌మెన్‌లు ఎర్రజెండా చూపించి నిలిపివేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Teachers: ‘కీచక టీచర్ల’ చిట్టా సిద్ధం..


nani4.jpg

పగుళ్లు ఏర్పడిన వంద మీటర్ల దూరంలోనే రైలు నిలవడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే, వాస్కోడిగామా-వేలాంకన్ని ఎక్స్‌ప్రెస్‌ మాయనూరు రైల్వేస్టేషన్‌లో, కరూర్‌-తిరుచ్చి అన్‌ రిజర్వ్‌డ్‌ రైలు వీరాక్కియం రైల్వేస్టేషన్‌లలో నిలిపివేశారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని కార్మికులు సరిచేయడంతో 45 నిమిషాలు ఆలస్యంగా ఎర్నాకుళం-కారైక్కాల్‌ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరి వెళ్లింది.


ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి

ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 12 , 2025 | 01:45 PM