Share News

Karur Tragedy Supreme: కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశం..

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:06 AM

కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

Karur Tragedy Supreme: కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశం..

ఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే చీఫ్ నటుడు విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. దీంట్లో 41 మందికిపైగా మృతి చెందగా.. పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ విషాదంపై న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జస్టిస్ కె.మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి అంజారియాలకు స్థానం దక్కింది.


ఇవి కూడా చదవండి..

Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు

Dalit IPS Officer: ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్‌

Updated Date - Oct 13 , 2025 | 11:10 AM