PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Mar 04 , 2025 | 03:58 PM
గుజరాత్లోని గిర్ అడవుల్లో సఫారీని సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండోరోజైన మంగళవారంనాడు తమ విలువైన సమయాన్ని వన్యప్రాణులతో సన్నిహితంగా మెలుగుతూ వాటికి ఆహారం అందజేశారు.

జామ్నగర్: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా గుజరాత్లోని గిర్ అడవుల్లో సఫారీని సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండోరోజైన మంగళవారంనాడు తమ విలువైన సమయాన్ని వన్యప్రాణులతో సన్నిహితంగా మెలుగుతూ వాటికి ఆహారం అందజేశారు. జామ్నగర్ జిల్లాలోని వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేందం 'వంతారా'ను సందర్శించారు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత అంబానీ, కోడలు రాధికా మర్చంట్ సైతం పాల్గొన్నారు.
PM Modi: ఆసియా సింహాలు పెరిగాయ్
వన్యప్రాణుల పునరావాస కేంద్రలో ఆశ్రయం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలుగుతూ, అక్కడి ఆసియా సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్లలు, అరుదైన క్లౌడెడ్ చిరుత పిల్లలకు స్వయంగా ఆహారం అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మోదీ అఫీషియల్ యూట్యూబ్ హ్యాండిల్లో షేర్ చేశారు.
వంతారాలోని పునరావాస కేంద్రలోని, ఆసుపత్రి, వెటర్నరీ సౌకర్యాలను, అక్కడ ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సీడీ స్కాన్, ఐసీయూ తదితర సౌకర్యాలను మోదీ వీక్షించారు. ప్రధాని మోదీ ఫీడింగ్ ఇచ్చిన తెల్లటి సింహం పిల్లకు ఒక చిన్న స్టోరీ ఉంది. పెద్ద సింహాన్ని సంరక్షించి పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత దానికి ఈ పిల్ల పుట్టింది. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో లైఫ్ సేఫింగ్ సర్జరీ జరుగుతున్న మరో చిరుతను మోదీ సందర్శించారు. హైవేపై కారు గుద్దడంతో తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఈ చిరుతను పునరావస కేంద్రానికి తెచ్చారు. సర్కెస్ నుంచి కాపాడి పునరావాస కేంద్రానికి తీసుకువ్చచిన గోల్డెన్ టైగర్, 4 స్నో టైగర్లతో మోదీ కాసేపు ఎదురెదురుగా కూర్చుని సన్నిహితంగా మెలిగారు. పునరావాస కేంద్రంలోని అతి పెద్ద కొండచిలువ, రెండు తలల పాము, రెండు తరల తాబేలు తదిరర వన్యప్రాణాలతో కొద్దిసేపు గడిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలిఫెంట్ ఆసుపత్రిని కూడా వంతరాలో ఆయన సందర్శించారు. అక్కడి వైద్యులు, సహాయక సిబ్బంది, వర్కర్లతో సంభాషించారు.
వంతారా గురించి...
వంతారా అనేది కుత్రిమ అడవి. గుజరాత్లోని జామ్నగర్ రిలయెన్స్ రిఫైనరీ క్లాంప్లెక్స్లో 3 వేల ఎకరాల్లో వంతారా ఉంది. ఇక్కడ 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రి కూడా ఉంది. ప్రపంచంలోనే ఇది ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద ఆసుపత్రి. ఇందులో రెండు వేల వన్యప్రాణులను సంరక్షిస్తు్న్నారు. వంతారాలో 2,000కు పైగా ప్రత్యేక జాతుల జంతువులు ఉన్నాయి. గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న 1.5 లక్షల జంతువులను రక్షించి ఈ పునరావస కేంద్రంలో ఆవాసం కల్పిస్తున్నారు. 2,100 మంది నిపుణులైన సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. వీరు జంతువుల పరిరక్షణతో పాటు వ్యన్యప్రాణుల సంరక్షణ, బయోడైవర్సిటీ ప్రాధాన్యతపై విజిటర్లలో చైతన్యం తెస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.