Female Empowerment: నారీ శక్తికి నీరాజనం
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:08 AM
నేపాల్కు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కర్కికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మహిళా సాధికారతకు ఇది నీరాజనమని పేర్కొన్నారు. చరిత్ర, విశ్వాసాలు...
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీలకు మోదీ అభినందనలు
ఇంపాల్, కాఠ్మాండూ, సెప్టెంబరు 13: నేపాల్కు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కర్కికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మహిళా సాధికారతకు ఇది నీరాజనమని పేర్కొన్నారు. చరిత్ర, విశ్వాసాలు, సంస్కృతి పరంగా భారత్, నేపాల్ అత్యంత సన్నిహిత మిత్ర దేశాలు అని పేర్కొన్నారు. ఈ సంధి కాలంలో న్యూఢిల్లీ పూర్తిగా నేపాల్ ప్రజల వెనుకే ఉందని స్పష్టం చేశారు. 140 కోట్ల భారతీయుల తరఫున సుశీల కర్కికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఆమె నేపాల్ను శాంతి, స్థిరత్వం, అభివృద్ధివైపు నడిపిస్తారని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. కాగా నేపాల్ పార్లమెంటు ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి 5న నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కార్యాలయం ప్రకటించింది. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కర్కి సిఫారసు మేరకు నేపాల్ ప్రతినిధుల సభను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఈమేరకు పార్లమెంటు ఎన్నికలు నిర్వహించే తేదీని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News