Operation Sindoor: పంజాబ్లో పాకిస్తాన్ డ్రోన్ దాడి.. ముగ్గురికి గాయాలు..
ABN , Publish Date - May 10 , 2025 | 07:14 AM
Operation Sindoor: భారత సైన్యం ఎంతో చాకచక్యంగా పాక్ మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేస్తూ వస్తోంది. అయితే, నిన్న పంజాబ్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు దాడులకు యత్నించాయి. శుక్రవారం ఫిరోజాబాద్లో పాకిస్తాన్ డ్రోన్ ఇళ్లపై పేలింది.

భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. భారత త్రివిధ దళాలు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నాయి. పాక్ కూడా భారత్ను దెబ్బ తీయడానికి విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది. మిస్సైల్, డ్రోన్ దాడులకు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం పాక్కు సంబంధించిన మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేస్తూ వస్తోంది. అయితే, నిన్న పంజాబ్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు దాడులకు యత్నించాయి. వాటిలో చాలా వాటిని భారత ఆర్మీ పేల్చేసింది. కానీ, ఓ పాకిస్తాన్ డ్రోన్ మాత్రం శుక్రవారం ఫిరోజాబాద్లోని ఇళ్లపై పేలింది.
ఈ సంఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడే చికిత్స అందుతోంది. ఇక, ఈ ఘటనపై ఫిరోజాబాద్ ఎస్ఎస్పీ భూపేందర్ సింగ్ సిద్దు మాట్లాడుతూ.. ‘ ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు మాకు సమాచారం అందింది. వారికి కాలిన గాయాలు అయ్యాయి. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. భారత ఆర్మీ పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లలో చాలా వాటిని ధ్వంసం చేస్తోంది’ అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇండియా దెబ్బ.. పాకిస్తాన్ అబ్బ
భారత్ కొడుతున్న దెబ్బకు పాకిస్తాన్ చుక్కలు చూస్తోంది. పాకిస్తాన్ దేశానికి అత్యంత కీలకమైన ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్)ను భారత్ కూల్చివేసింది. రాత్రి వేళ దాడి చేయడానికి పాక్ దీన్ని యాక్టివేట్ చేసింది. అది గుర్తించిన భారత్.. పంజాబ్ ప్రావిన్స్లో దాన్ని కూల్చేసింది. శత్రు విమానాలు, క్షిపణుల కదలికలపై నిఘా పెట్టి, కీలక సమాచారం అందించే అవాక్స్ విమానాన్ని కూల్చేయటం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. ఇదే కాదు పాక్కు సంబంధించిన కీలక ఆయుధాలను భారత్ పేల్చిపడేస్తోంది.
ఇవి కూడా చదవండి
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Car Price Hike: మెర్సిడెస్ బెంజ్ కార్ల ధర పెంపు