Car Price Hike: మెర్సిడెస్ బెంజ్ కార్ల ధర పెంపు
ABN , Publish Date - May 10 , 2025 | 05:56 AM
ఈ ఏడాది రెండు విడతలలో మెర్సిడెస్ బెంజ్ తమ కార్ల ధరను రూ.90,000 నుంచి రూ.12.2 లక్షల వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఫారెక్స్ ఆటుపోట్ల ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం ఈ ధరల సవరణ చేపట్టాలని కంపెనీ పేర్కొంది.

న్యూఢిల్లీ: ఈ ఏడాది రెండు విడతలుగా తమ కార్ల ధర రూ.90000 నుంచి రూ.12.2 లక్షల మధ్యలో పెంచనున్నట్టు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ఫారెక్స్ ఆటుపోట్ల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించుకునేందుకు ఈ చర్య దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలియచేసింది. జూన్, సెప్టెంబరు నెలల్లో ధరల సవరణ ఉంటుందని పేర్కొంది. సీ-క్లాస్ కార్ల ధర కనిష్ఠంగా రూ.90 వేలు, మేబాక్ ఎస్ 680 ధర గరిష్ఠంగా రూ.12.2 లక్షలు పెరుగుతాయని తెలిపింది.