Share News

Censorship: 5 నెలల్లో మోదీ ప్రభుత్వం 130 సెన్సార్‌షిప్ ఆదేశాలు జారీ..పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకేనా..

ABN , Publish Date - Apr 22 , 2025 | 09:55 AM

భారతదేశంలో బావ ప్రకటనా స్వేచ్ఛ క్రమంగా దెబ్బతింటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ప్రభుత్వం జారీ చేసిన సెన్సార్‌షిప్ ఉత్తర్వుల సంఖ్య పెరగడం ప్రస్తుతం ఈ ప్రశ్నలు వేసేలా చేస్తోంది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Censorship: 5 నెలల్లో మోదీ ప్రభుత్వం 130 సెన్సార్‌షిప్ ఆదేశాలు జారీ..పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకేనా..
130 Censorship Orders

మోదీ ప్రభుత్వం బావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తుందని కొంత మంది ఆరోపిస్తున్నారు. అందుకు గల కారణం హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సహయోగ్ పోర్టల్ ద్వారా గత 5 నెలల్లో 130 సెన్సార్‌షిప్ ఉత్తర్వులు జారీ చేయడమేనని చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000లోని సెక్షన్ 79(3)(బి) కింద ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఇది కంటెంట్‌ను తొలగించడానికి లేదా యాక్సెస్‌ను నిరోధించడానికి వీలు కల్పిస్తుంది. సహయోగ్ పోర్టల్‎ను 2024లో హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అభ్యంతరకరమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను వెంటనే తొలగించడం, నిరోధించడమే దీని లక్ష్యం.


ఇప్పటివరకు..

ఈ పోర్టల్‌ను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నిర్వహిస్తుంది. సైబర్‌ స్పేస్‌ను సురక్షితంగా ఉంచడానికి సమన్వయంతో కూడిన చర్యలను తీసుకునేందుకు దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఒకే వేదికపైకి తీసుకొస్తారు. ఇప్పటివరకు ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెలిగ్రామ్, ఆపిల్, షేర్‌చాట్, స్నాప్‌చాట్, లింక్డ్ఇన్, యూట్యూబ్ వంటివి కూడా దీని పరిధిలో ఉన్నాయి.


గ్రూపులను బ్లాక్ చేయగలదు

ఈ పోర్టల్లో 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అధికారులను నమోదు చేసుకున్నాయి. ఈ పోర్టల్ ద్వారా గూగుల్ తన ప్లే స్టోర్ యాప్, యూట్యూబ్ వీడియోలు, డ్రైవ్ లింక్‌లను బ్లాక్ చేయగలదు. దీంతోపాటు వాట్సాప్ నంబర్‌లు, ఛానెల్‌లు లేదా గ్రూపులను బ్లాక్ చేయగలదని ఓ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అదేవిధంగా, Facebook, Instagram కంటెంట్, ప్రొఫైల్‌లు, ప్రకటనల పోస్ట్‌లను కూడా తీసే అధికారం ఉంటుంది.


సెన్సార్‌షిప్ విధానం

ఈ పోర్టల్ విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా కంపెనీ X కర్ణాటక హైకోర్టులో సెన్సార్‌షిప్ పోర్టల్ అని పేర్కొంటూ దావా వేసింది. సెక్షన్ 79(3)(b)ని ఉపయోగించడం ద్వారా, ప్రభుత్వం చట్టవిరుద్ధమైన సెన్సార్‌షిప్ విధానాన్ని పాటిస్తుందని తెలిపింది. ఇది ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద సూచించబడిన విధానపరమైన రక్షణలను పాటించడం లేదని X వాదిస్తోంది. సెక్షన్ 69A జాతీయ భద్రత, ప్రజా సంక్షేమం వంటి కారణాలపై కంటెంట్‌ను నిరోధించడానికి, స్వతంత్ర సమీక్ష వంటి విధానాలకు అనుమతిస్తుంది.


ఏ కంటెంట్‌ను కూడా..

కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. X వాదనను దురదృష్టకరం, ఖండించదగినదని పేర్కొంది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహయోగ్ పోర్టల్ ఒక సులభతరం చేసే యంత్రాంగం అని వెల్లడించింది. తగిన ప్రక్రియ లేకుండా ఏ కంటెంట్‌ను బ్లాక్ చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, ఈ పోర్టల్‌ ప్రస్తుతం పారదర్శకత పాటించడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..


Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్


Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 22 , 2025 | 09:55 AM